కడప: కమలాపురం ఓ పాఠశాలకు ఎంఈఓ బేబీ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాల నడుపుతున్నట్లు గుర్తించారు. అవసరమైన వసతులు లేకపోవడంతో గతంలో అనుమతి నిరాకరించినప్పటికీ యాజమాన్యం సరైన వివరణ ఇవ్వలేదని తెలిపారు. నోటీసుల అనంతరం స్కూల్ మూసివేతతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.