• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఇంటర్ సెకండియర్ పరీక్ష.. ఎంత మంది గైర్హాజరు అంటే..!

KDP: ఇవాళ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మంగళవారం జిల్లాలో 62 కేంద్రాల్లో 15,159 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 14,777 మంది విద్యార్థులు హాజరయ్యారు. 382 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 14,011 మంది జనరల్ విద్యార్థుల్లో 13,691 మంది హాజరవ్వగా.. 320 మంది గైర్హాజరయ్యారు.

February 24, 2026 / 07:46 PM IST

RUB నిర్మాణాలకు భూసేకరణ వేగవంతం చేయాలి: జేసీ

W.G: భీమవరం కలెక్టరేట్ నుంచి మంగళవారం రైల్వే కన్స్ట్రక్షన్ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులతో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అనుమతులు లభించిన నవాబ్ పాలెం (378), పత్తిపాడు (376), ఆరుగొలను (379) లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల (RUB) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

February 24, 2026 / 07:44 PM IST

టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్

KRNL: కౌతాళం మండలం కుంబలనూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బొంబాయి ముత్తన్న టీడీపీకి సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

February 24, 2026 / 07:43 PM IST

‘ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ’

ASR: మార్చి నెల 1వ తేదీ ఆదివారం కావడంతో ఈనెల 28న శనివారం లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము పంపిణీ చేయడం జరుగుతుందని కొయ్యూరు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు మంగళవారం తెలిపారు. మండలంలో 7,457 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.3,12,79,000 సొమ్ము మంజూరైనట్లు తెలిపారు. ఈనెల 27న బ్యాంకుల నుంచి పెన్షన్ సొమ్మును విత్ డ్రా చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.

February 24, 2026 / 07:38 PM IST

వాహనాలను తనిఖీ చేసిన సీఐ

కృష్ణా: గుడివాడలో టూ టౌన్ సీఐ హనీష్ కుమార్ మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను కలిగి ఉండాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 24, 2026 / 07:37 PM IST

లింగంపేటలో పర్యటించిన ఎంపీడీవో

AKP: నాతవరం(మం) లింగంపేట పంచాయతీలో మంగళవారం ఎంపీడీవో ఎంఎస్. శ్రీనివాస్ పర్యటించారు. ముందుగా పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పరిశీలించారు. క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలని వారికి సూచించారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించాలని ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంను సందర్శించి, పౌష్టికాహారంను సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు.

February 24, 2026 / 07:35 PM IST

ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేత

E.G: రాజానగరం నియోజకవర్గ స్వరూప నగర్ కాలనీకి చెందిన రాధాక్రిష్ణ మూర్తి (75) కల్తీ పాలు తాగి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం పరామర్శించారు. అనంతరం కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో RDO కృష్ణ నాయక్, రాజానగరం MRO తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 07:30 PM IST

గుంటూరులో ఈవీఎం గోదాము తనిఖీ

GNTR: గుంటూరు కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా గోదాము తాళాల సీళ్లు, సీసీ కెమెరాలు, ప్రాంగణాన్ని పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. భద్రతా చర్యలను నిరంతరం పటిష్టంగా అమలు చేయాలని ఆమె సూచించారు.

February 24, 2026 / 07:30 PM IST

కౌతాళం కొనసాగుతున్న రాజీనామాల పర్వం

KRNL: కౌతాళం మండలం కుంబలనూరు మాజీ ఎంపీటీసీ, టీబీపీ ఎల్ఎల్‌సీ వైస్ ఛైర్మన్ ఈరన్న టీడీపీ సభ్యత్వానికి, తన పదవికి ఇవాళ రాజీనామా చేశారు. ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ విషయంలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. కష్టపడిన వారికి గుర్తింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 24, 2026 / 07:27 PM IST

మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా

శ్రీ‌కాకుళం న‌గ‌ర కార్పొరేష‌న్ ప‌రిధిలో డ‌యేరియా కార‌ణంగా మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్ర‌భుత్వం అండగా ఉంటుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతుని కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇతర బాధిత కుటుంబాల‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు.

February 24, 2026 / 07:25 PM IST

షార్ట్ సర్క్యూట్‌తో భవనం దగ్థం..!

అన్నమయ్య: మదనపల్లిలోని మల్లికార్జున సర్కిల్ వద్ద అగ్నిప్రమాదం సంభవించగా,పెద్ద ప్రమాదం తప్పింది. వినాయక పశువుల దాణా భవనం మిద్దెపై ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది అధికారి శివప్ప ఆధ్వర్యంలో వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వేగవంతమైన చర్యలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడినట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 07:25 PM IST

శనగల కొనుగోలు ప్రక్రియ వేగవంతం: జేసీ

ATP: జిల్లాలో శనగల కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది క్వింటాల్ శనగలకు ప్రభుత్వం 5,875 రూపాయల మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు.

February 24, 2026 / 07:20 PM IST

కలెక్టర్ చొరవ.. క్షేమంగా స్వగ్రామానికి చేరిక

కోనసీమ: మస్కట్‌లో తీవ్ర ఇబ్బందులు పడ్డ తాటిపాకకు చెందిన కర్రీ సౌజన్య, కందికుప్పకు చెందిన బొజ్జ లక్ష్మీదుర్గ మంగళవారం క్షేమంగా స్వగ్రామం చేరారు. ఉపాధి కోసం వెళ్లి అక్కడ పని దొరకక అవస్థలు పడుతున్న వారిని కలెక్టర్ మహేశ్ కుమార్ చొరవతో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా రప్పించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 07:20 PM IST

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఐఎఫ్టీయూ ధర్నా

ELR: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలందరికీ పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నగర అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ.. చిన్న చిన్న కారణాలతో రోగులను విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు రిఫర్ చేయడం సరికాదన్నారు.

February 24, 2026 / 07:20 PM IST

ట్రిప్పర్ ఢీకొని.. వృద్ధుడు తీవ్రంగా గాయాలు..!

KDP: ఎర్రగుంట్లలోని నాలుగు రోడ్ల కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రోడ్డు దాటుతున్న సుమారు 80 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడిని కడప రోడ్డునుంచి వేంపల్లె వైపు వెళ్తున్న ట్రిప్పర్ ఢీకొట్టింది.ఘటనను గమనించిన స్థానికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయగా,వాహనాన్ని ఆపి వృద్ధుడిని బయటకు తీశారు.తలకు తీవ్ర గాయాలైన వృద్ధుడిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.

February 24, 2026 / 07:16 PM IST