• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జాతీయ రహదారిపై బొలెరో బోల్తా

ప్రకాశం: టంగుటూరు మండలం బాపూజీ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం బోలోరో బోల్తా పడింది. వినుకొండ నుంచి నాయుడుపేట వెళుతున్న బొలెరో వాహనం వెనుక టైరు పగలడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. డివైడర్ పైన పడటంతో ట్రాఫిక్ సైతం అంతరాయం లేదు.

March 24, 2026 / 06:00 PM IST

‘సంపన్నకారి’ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: పీడీ

ATP: ‘సంపన్నకారి’ కార్యక్రమాన్ని పొదుపు సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ శైలజ సూచించారు. మంగళవారం జిల్లా సమాఖ్య కార్యాలయంలో ఈ పథకానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏటా రూ.12 లక్షల టర్నోవర్ ఉండి, రెండేళ్ల అనుభవం ఉన్న సభ్యులకు ఆర్థిక సాయం, మార్కెటింగ్, బ్రాండింగ్‌లో ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు.

March 24, 2026 / 06:00 PM IST

మైదుకూరులో రామాలయ మహోత్సవం

KDP: మైదుకూరు పట్టణంలోని 16వ వార్డులో గల రామాలయంలో జరుగుతున్న మహోత్సవాల్లో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. మూడు రోజులపాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో గణపతి, సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

March 24, 2026 / 06:00 PM IST

జొన్నవాడలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR: బుచ్చి మండలం జొన్నవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ముందుగా జొన్నవాడ గ్రామంలో కోటి రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును, నూతనంగా నిర్మించిన డ్రైనేజీలను, వాటర్ బోర్ పాయింట్లను కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. ముందుగా కూటమి నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

March 24, 2026 / 06:00 PM IST

నల్లమోతువారిపాలెంలో తీరనున్న తాగునీటి కష్టాలు

BPT: వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కొత్తగా చేతిపంపులను ఏర్పాటు చేసినట్లు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలిపారు. మండల పరిషత్ నిధులు రూ.2.5 లక్షలతో ఈ పనులను పూర్తి చేశారు. ఈ క్రమంలో మంగళవారం RWS ఏఈ బాషా గ్రామంలో పర్యటించి, కొత్తగా ఏర్పాటు చేసిన చేతిపంపులను పరిశీలించారు.

March 24, 2026 / 06:00 PM IST

మాజీ సీఎం జగన్‌ను కలిసిన మాజీ హోం మంత్రి

E.G: గోపాలపురం వైసీపీ ఇంఛార్జ్, మాజీ హోంమంత్రి తానేటి వనిత మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలను ఆమె జగన్‌కు వివరించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.

March 24, 2026 / 06:00 PM IST

‘పాత పెన్షన్ అమలు చేయాలి’

SKLM: పలాసలోని యూటీఎఫ్ నాయకులు మంగళవారం రణభేరి నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఐఆర్ 29% వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

March 24, 2026 / 05:55 PM IST

మదనపల్లి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా జేసీ

అన్నమయ్య: మదనపల్లి మున్సిపాలిటీకి జేసీ శర్మను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఆయన మున్సిపాలిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నగరంలో మౌలిక వసతుల మెరుగుదల, పెండింగ్ పనుల పూర్తి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, సమర్థవంతంగా మున్సిపల్ పరిపాలన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

March 24, 2026 / 05:55 PM IST

ఆక‌ట్టుకుంటున్న కేఎఫ్‌సీ సైకత శిల్పం

VSP: ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ KFC చికెన్ బకెట్ సైకత శిల్పం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. నగరంలో కేఎఫ్‌సీ 14వ బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ రెండు రోజుల పాటు శ్రమించి ఈ కళాఖండాన్ని రూపొందించారు. ఈ శిల్పం వద్ద పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

March 24, 2026 / 05:55 PM IST

గుండ్లకొండలో సుంకలమ్మ దేవి ఉత్సవాలు

KRNL: దేవనకొండ(మం) గుండ్లకొండలో జరిగిన శ్రీ సుంకలమ్మ దేవి ఊరు దేవర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో మంగళవారం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, మండల కన్వీనర్లు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై ఉత్సవాలను ఘనంగా జరిపారు.

March 24, 2026 / 05:47 PM IST

‘రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం’

KDP: రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ నాగూరు వీరభద్రుడు పేర్కొన్నారు. మంగళవారం సిద్ధవటం మండలం మాధవరం-1లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరభద్రుడు మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.

March 24, 2026 / 05:47 PM IST

తాడేపల్లిగూడెంలో ‘రైతన్న మీకోసం’

W.G: తాడేపల్లిగూడెం(మం) కొమ్ముగూడెం, పట్టింపాలెం, బంగారుగూడెం గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు వారి ఖాతాల్లో జమయ్యాయా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు, అవసరాలు తెలుసుకుంటూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

March 24, 2026 / 05:46 PM IST

కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

E.G: కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 1వ డివిజన్ నారాయణపురం వాంబే గృహాల వద్ద నగర పాలక సంస్థ చేపట్టిన ఆక్రమణల తొలగింపుతో ఉపాధి కోల్పోయిన 12 మందికి వారి కుటుంబ అవసరాల నిమిత్తం ఎమ్మెల్యే.. తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్ధిక సహాయం అందించారు. కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

March 24, 2026 / 05:46 PM IST

తెనాలి అభివృద్ధిపై మంత్రి సమావేశం

GNTR: తెనాలి పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పట్టణాన్ని రాష్ట్రంలో టాప్-5 స్థానంలో నిలిపేలా కార్యాచరణ రూపొందించాలని, పన్నుల వసూళ్లు 95 శాతం సాధించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రూ.9 కోట్ల నిధులను త్వరితగతిన రాబట్టాలని సూచించారు.

March 24, 2026 / 05:45 PM IST

సోలార్ విద్యుత్ యూనిట్ ప్రారంభం

ELR: దెందులూరు నియోజకవర్గంలో SC, ST కుటుంబాలకు 100% సబ్సిడీతో 2KW సామర్థ్యం గల సోలార్ విద్యుత్ యూనిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. లబ్ధిదారుని ఇంటి వద్ద ఏర్పాటు చేసిన తొలి సోలార్ విద్యుత్ యూనిట్‌ను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. SC, ST సంక్షేమానికి, అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు.

March 24, 2026 / 05:44 PM IST