ATP: ముంబై(CSMT) నుంచి చెన్నై వెళ్లే సమ్మర్ స్పెషల్ రైలు, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, మీదుగా నడవనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. ఈ రైలు ప్రతి ఆదివారం ముంబై (రైలు నెం 01015) నుంచి బయలుదేరుతున్నట్లు తెలిపారు. చెన్నై (రైలు నెం 01016) నుంచి ప్రతి సోమవారం బయలుదేరనుందన్నారు. వేసవి దృష్ట్యా ప్రయాణికులు రద్దీ రీత్యా నడపనున్నట్లు తెలిపారు.