కడప: ఏప్రిల్ 1న జరిగే కళ్యాణోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఇంఛార్జ్ మంత్రి ఎస్. సవిత తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, ప్రసాదం, ఎల్ఈడీ స్క్రీన్లు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
CTR: రేపు పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించినట్లు MRO రాము సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.00 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు.
E.G: బీసీ సోదరుల హక్కుల పరిరక్షణ కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ సిద్ధపడ్డారని పార్టీ గోపాలపురం కన్వీనర్ నాచుకు ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఏప్రిల్ 11న ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీక్షకు మద్దతు పలకాలని కోరుతూ ఇవాళ గోపాలపురంలో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు.
KRNL: అమరావతికి వైసీపీ పార్టీ వ్యతిరేకం కాదని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు. R&B గెస్ట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనలో శాశ్వత భవనాలు కూడా నిర్మించలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పనులు కనిపించడం లేదన్నారు. జగన్పై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
VZM: మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నెల్లిమర్ల MLA లోకం నాగమాధవి సంయుక్తంగా సోమవారం డెంకాడ మండలం నాతవలసలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన సేవలు ఒకే చోట అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు.
E.G: APSRTC అన్ని బస్సుల్లోనూ దివ్యాంగులకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసి కుమార్ డిమాండ్ చేశారు. ఇవాళ రాజమండ్రిలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగిన PGRSలో DRO సీతారామ్మూర్తికి వినతి పత్రం అందజేశారు. ఉచిత దివ్యాంగుల బస్సు పథకంలో కొన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారని ఆరోపించారు.
E.G: APSRTC అన్ని బస్సుల్లోనూ దివ్యాంగులకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసి కుమార్ డిమాండ్ చేశారు. ఇవాళ రాజమండ్రిలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగిన PGRSలో DRO సీతారామ్మూర్తికి వినతి పత్రం అందజేశారు. ఉచిత దివ్యాంగుల బస్సు పథకంలో కొన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారని ఆరోపించారు.
AKP: అచ్యుతాపురం మండలం మోసయ్యపేట పంచాయతీలో జరగాల్సిన వారపు సంత వేలంపాటను చివరి నిమిషంలో అధికారులు రద్దు చేశారు. దీంతో భారీగా హాజరైన కాంట్రాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పై అధికారుల ఆదేశాల మేరకే రద్దు చేసినట్లు కార్యదర్శి ఎస్. శ్రీను తెలిపారు. ముందస్తు సమాచారం లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
VSP: పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను విన్న అనంతరం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా నిర్ణీత గడువులో సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
AKP: జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి సోషల్ పరీక్షకు 74 మంది గైర్హాజర్ అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. జిల్లాలో 102 పరీక్ష కేంద్రాల్లో 20,764 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 20,690 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలో 11 పరీక్ష కేంద్రాలను తను తనిఖీ చేసినట్లు తెలిపారు.
EG: ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని అందించడానికి రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి శ్రీనివాస్ ఇసుక శిల్పాన్ని ఇవాళ రూపొందించారు. యుద్ధం అమాయక ప్రజలకు, పిల్లలకు కన్నీళ్లను, నష్టాన్ని మాత్రమే మిగులుస్తుందని పేర్కొన్నారు. ఈ కళాకృతి ద్వారా నాయకులు ప్రపంచ సమాజాన్ని సంఘర్షణకు బదులుగా శాంతిని ఎంచుకోవలన్నారు.
కోనసీమ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న 2.50 లక్షల గృహప్రవేశ మహోత్సవాల సందర్భంగా, అమలాపురం పట్టణం 30వ వార్డులో జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కల సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు.
GNTR: మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేసిన మూడు పిటీషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. కేసును CBIకి అప్పగించాలని, CM చంద్రబాబుకు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని, ACB కోర్టు విచారణను MP, MLAల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని ఆర్కే పిటీషన్లు దాఖలు చేశారు. కాగా, వాటిని హైకోర్టు కొట్టివేసింది.
కోనసీమ: మండపేటలోని గొల్లపుంతలో టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించే కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి, MLA వేగుళ్ళ జోగేశ్వర రావు మొదటగా లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు నిర్వహించారు. గొల్లపుంత, వి.వి కాలనీలలో మొత్తం 6,128 గృహాలను గ్రౌండింగ్ చేయగా, ఇప్పటికే 5,024 గృహాలను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు.
ATP: కనేకల్ మండలంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. కనేకల్, సొల్లాపురం, నాగేపల్లి గ్రామాలకు చెందిన వంశీ, సాయి, హరి విజయ్, కమల, చంద్రకళ, శాంతి సహా పలువురు కార్యకర్తలు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను నడిపించాయని వారు పేర్కొన్నారు.