• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘సొంతింటి కల కూటమి ప్రభుత్వంతో నెరవేరుతుంది’

ATP: రాయదుర్గంలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని ఎమ్మెల్యే కాల్వ పేర్కొన్నారు. మొలకమూరు రోడ్డుకు సమీపంలో రూ.2 లక్షల 50 వేల వ్యయంతో నిర్మించిన నూతన గృహాన్ని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

March 30, 2026 / 02:58 PM IST

‘ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి’

అన్నమయ్య: ఎన్నికల సమయంలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. రాజంపేటలోని కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థకు ఆశా కార్యకర్తలు వెన్నుముక లాంటి వారని చెప్పారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించారన్నారు.

March 30, 2026 / 02:57 PM IST

దోమల నియంత్రణ నెట్లు ధ్వంసం.. కలెక్టర్ ఆగ్రహం

W.G: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హితబోధ చేశారు. ఉంగుటూరు మండలం కైకరం సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ సౌకర్యాలు, విద్యార్థుల విద్య అభ్యాసన స్థాయిలను వసతి గృహంలో దోమల నియంత్రణ నెట్లను ధ్వంసం కావడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 30, 2026 / 02:55 PM IST

ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఎంపీ

KDP: పులివెందుల పట్టణం స్థానిక భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యల వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి కృషి చేశారు. ఎంపీ ప్రజల నుంచి సుమారు 50 సమస్యల వినతులను స్వీకరించారు.

March 30, 2026 / 02:53 PM IST

డోన్‌లో వైసీపీ పత్రికా సమావేశం

నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన అంశంపై పత్రికా సమావేశం సోమవారం జరిగింది. ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ నిర్ణయంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

March 30, 2026 / 02:50 PM IST

జలమయమైన ప్రధాన రోడ్డు

మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ రోడ్డులో గల పూల సుబ్బయ్య కాలనీలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్డంతా జలమయమైంది. రోడ్డు కుంటలతో నిండి ఉండటంతో నీరంతా అక్కడే నిలిచిపోయిందని స్థానికులు వాపోయారు. కాలనీ నిర్మాణం జరిగి 40 సంవత్సరాలు అవుతున్నా కనీస డ్రైనేజ్ కాలువలు కూడా నిర్మించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వరద నీరు వల్ల దోమలు వ్యాపిస్తున్నాయన్నారు.

March 30, 2026 / 02:50 PM IST

సామూహిక గృహ ప్రవేశాలను ప్రారంభించిన సర్పంచ్

ATP: వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీలో ప్రభుత్వ లేఔట్‌లో గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్ చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మోనాలిసా, తహశీల్దార్ నరేష్ కుమార్ హాజరయ్యారు. అనంతరం గృహ లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

March 30, 2026 / 02:48 PM IST

నిజాంపట్నం కొత్త తహసీల్దార్‌గా శ్రీనివాసరావు

BPT: నిజాంపట్నం తహసీల్దార్‌గా పాలపర్తి శ్రీనివాసరావు నియమితులై సోమవారం అధికార బాధ్యతలు చేపట్టారు. గతంలో CCLAగా సేవలందించిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

March 30, 2026 / 02:44 PM IST

టిడ్కో గృహాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: తాడిపత్రి మండలం గన్నేవారిపల్లెలో టిడ్కో గృహ ప్రవేశాల కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. జిల్లా కలెక్టర్ ఆనంద్, MLA జేసీ అస్మిత్ రెడ్డి కలిసి మొదటి విడతలో 1024 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం నాణ్యతతో పూర్తి చేసి, మౌలిక సదుపాయాలు కల్పించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

March 30, 2026 / 02:43 PM IST

జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

VSP: జిల్లా కోర్టుకు బాంబ్ బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అనుమానాస్పద వస్తువులు ఏమి లభించలేదు. ఈ మెయిల్ తమిళనాడు నుంచి వచ్చినట్లు గుర్తించిన సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే కోర్టుకి రెండోసారి బెదిరింపు రావడం గమనార్హం.

March 30, 2026 / 02:43 PM IST

పెద్దకడబూరులో 12 మంది పరీక్షకు గైర్హాజరు

KRNL: పెద్దడబూరులో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇవాళ జరిగిన బయోలాజికల్ సైన్స్ పరీక్షకు KGBV పాఠశాలలో 135మందికి గాను, 133మంది హాజరు కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. APమోడల్ స్కూల్‌లో 254 మందికి గాను, 249 మంది హాజరు కాగా, 5 మంది గైర్హాజరయ్యారు. ZPపాఠశాలలో 254మందికి గాను, 249 మంది హాజరు కాగా, ఐదుగురు గైర్హాజరైనట్లు MEO భాషా తెలిపారు.

March 30, 2026 / 02:42 PM IST

గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: పేద ప్రజలకు సొంతింటి కల కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. సోమవారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకంలో భాగంగా అర్హులైన లబ్దిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా 2,50,893ల నూతన గృహాల నిర్మాణం పూర్తి కావడం ఎంతో హర్షణీయమన్నారు. దీనిలో భాగంగా తణుకులోని 15వ వార్డులో ఏర్పాటు చేసిన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 30, 2026 / 02:40 PM IST

జనావాసాల్లో సెల్ టవర్ నిర్మించవద్దని వినతి

W.G: ఆకివీడు నగర పరిధిలోని శాంతినగర్లో నివాస ప్రాంతాల మధ్య సెల్ టవర్ నిర్మాణానికి అనుమతి ఇవ్వద్దని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం టవర్ నిర్మాణం చేయొద్దని, సెల్ టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్‌కు కాలనీలో నివసించే ప్రజల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

March 30, 2026 / 02:38 PM IST

గ్యాస్ బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని వినతిపత్రం

KKD: సామాన్య ప్రజలకు గ్యాస్ సిలిండర్ల సరఫరా అందని ద్రాక్షలా మారిందని సీపీఎం పెద్దాపురం మండల కమిటీ ఆరోపించింది. ఇవాళ పెద్దాపురం RDO కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం కన్వీనర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను తక్షణమే అరికట్టాలని, ప్రజలకు సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

March 30, 2026 / 02:37 PM IST

రామభద్రపురంలో పీఎసీఎస్ మహా జన సభ

VZM: రామభద్రపురం స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS) మహా జన సభను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం ఛైర్మన్‌ చొక్కాపు రామారావు‌ మాట్లాడుతూ.. సొసైటీ ప్రగతి, రైతుల అభివృద్ధి, వ్యవసాయ రుణాలు, ఎరువుల అందించాలనే కీలక అంశాలపై పాలకవర్గ సభ్యులు, రైతులతో కలిసి చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలొ CEO వాసు, MPTCలు, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

March 30, 2026 / 02:35 PM IST