• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బాల బాలికలకు సైక్లింగ్ పోటీలు

AKP: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అనకాపల్లి సుంకర మెట్టు నుంచి దేవిపురం వరకు సైక్లింగ్ ఎంపిక పోటీలు మంగళవారం నిర్వహించినట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి పీ. శైలజ తెలిపారు. అండర్ 18 విభాగంలో 45 మంది బాలురు, పదిమంది బాలికలు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలో ఎంపికైన వారు ఈనెల 28 నుంచి విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

February 24, 2026 / 09:06 PM IST

ఓర్వకల్లు శివాలయంలో ప్రారంభమైన ప్రతిష్ఠా ఉత్సవాలు

PLD: అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామంలో శివాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం జరిగిన ముందస్తు పూజా కార్యక్రమాల్లో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

February 24, 2026 / 09:03 PM IST

అంబులెన్స్ ఛార్జీలు అధికంగా వసూలు చేస్తే చర్యలు: కలెక్టర్

BPT: ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లనే వసూలు చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం చార్జీల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆయన, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక వసూళ్లపై ఫిర్యాదు చేసేందుకు 7702806804 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

February 24, 2026 / 09:00 PM IST

కొమరాడలో ఏనుగుల గుంపు

PPM: కొమరాడ మండలం వన్నాంగ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది మంగళవారం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

February 24, 2026 / 08:58 PM IST

కనక దుర్గమ్మను దర్శించిన ఎమ్మెల్యే

SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి మంగళవారం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి పై కొలువున్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

February 24, 2026 / 08:57 PM IST

బాల్య వివాహాలు సామాజిక శాపం

PPM: బాల్య వివాహాలు సామాజిక శాపమని, అందుకే వాటి పట్ల అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా బాలల సంరక్షణ విభాగం చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (NIC) ఎం.ఏ.నాయుడు పేర్కొన్నారు. మంగళవారం పాచిపెంట మండలంలోని కొత్తవలస, కర్రివలస ZPHSలో ప్రత్యేక సదస్సులను ఆయన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు.

February 24, 2026 / 08:54 PM IST

జీఎస్టీ వసూళ్లపై కలెక్టర్ ఆదేశాలు

కృష్ణా: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు–సేవల పన్నుల వసూళ్లు సజావుగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో వాణిజ్య పన్నుల వసూళ్లపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

February 24, 2026 / 08:45 PM IST

పెద్ద శేషు వాహనంపై ఊరేగిన వేంకన్న

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ కోనేటి వద్ద వెలిసిన శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి పెద్ద శేషు వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు విహరించారు. స్వామి వారి ముందు ప్రత్యేకంగా కోలాటాలు, చెక్క భజనలు, కీర్తనలు గోవింద నామాలతో వాయిద్యాలతో భక్తులకు కనువిందు చేశారు.

February 24, 2026 / 08:42 PM IST

25న నెల్లూరుకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాక

NLR: ఈనెల 25న నెల్లూరుకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ రానున్నట్లు జిల్లా పౌర సంబంధాల సమాచార శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉ.10.30 గంటలకు నెల్లూరులోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకుంటారు. అనంతరం ఉ.11.00 గంటల నుంచి కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో పోష్ యాక్టు -2013 పై జరిగే వర్క్ షాపులో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.

February 24, 2026 / 08:40 PM IST

నేషనల్ వాలీబాల్ పోటీలకు ఎంపికై జిల్లా వాసి

KDP: పోరుమామిళ్ల (M) చెందిన ఫేక్ మాబు షరీఫ్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంటుకు ఎంపికయ్యాడు. ఈనెల 25 నుంచి 28 వరకు ఉత్తరప్రదేశ్ మీట్లో జరుగునున్న 14వ సీనియర్ పారసిట్టింగ్ వాలిబాల్ నేషనల్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టీమ్ నుంచి మాబు షరీఫ్ పాల్గొంటారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబడచిన మాబు షరీఫ్ నేషనల్ పోటీలకు ఎంపిక చేశామని వాలీబాల్ అసోసియేషన్ తెలిపింది.

February 24, 2026 / 08:34 PM IST

జిల్లాలో మెగా జాబ్ మేళా

W.G: భీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న నిర్వహించనున్న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ మేళాలో సుమారు 21 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలన్నారు.

February 24, 2026 / 08:34 PM IST

‘రాష్ట్రంలో జంగిల్‌రాజ్, గురజాలలో గుండారాజ్ నడుస్తోంది’

PLD: జూలకల్లులో టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైసీపీ నాయకుడు రామిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పరామర్శించారు. రాష్ట్రంలో జంగిల్‌రాజ్, గురజాలలో గుండారాజ్ నడుస్తోందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే యరపతినేని అభివృద్ధిని గాలికొదిలి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల అండతో ఇప్పటికే ఐదుగురు వైసీపీ నేతలపై దాడులు చేశారని అన్నారు.B

February 24, 2026 / 08:32 PM IST

గుంటూరులో మహిళా గ్రీవెన్స్

GNTR: పశ్చిమ టీడీపీ ఆఫీసులో మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశాలతో దీన్ని నిర్వహించారు. నియోజకవర్గ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పింఛన్లు, ఇళ్లు, ఉపాధి తదితర సమస్యలపై వినతులు ఇచ్చారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీల, ఇతర నేతలు వీటిని స్వీకరించారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

February 24, 2026 / 08:30 PM IST

నాటు సారా కేసులో ఇద్దరికి బైండోవర్‌

ELR: చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పాత నాటు సారా కేసుల ముద్దాయిలను మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో హాజరుపరిచారు. వనమా కొండలరావు, కటారి కోటేశ్వరరావులపై మండల మెజిస్ట్రేట్ సమక్షంలో 129 BNSS కింద బైండోవర్ విధించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వారు భవిష్యత్తులో నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలన్నారు.

February 24, 2026 / 08:30 PM IST

అంగన్వాడీల రెండు రోజుల నిరాహారా దీక్షలు

SKLM: తమ డిమాండ్ల సాధకు అంగన్వాడీ వర్కర్లు రెండు రోజుల నిరాహారా దీక్షలకు బుధవారం నుంచి సమయత్తం అవుతున్నారని సీఐటీయు ప్రతినిధి పి. తెజేశ్వరరావు మంగళవారం తెలిపారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలనే ప్రధాన డిమాండ్, ఇతర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిరావుబాపూలే పార్క్ వద్ద నిరాహార దీక్షలకు దిగుతామన్నారు.

February 24, 2026 / 08:30 PM IST