విశాఖపట్నం అల్లిపురం 33వ వార్డులో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. రాష్ట్రంలో మళ్లీ రామరాజ్యం రావాలని ఆకాంక్షించారు. అలాగే, శ్రీరాముడి పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారని పేర్కొన్నారు.
శ్రీకాకుళం నగరం రామలక్ష్మణ కూడలి వద్ద శ్రీ సత్యసాయి సేవా సమితి బ్యాంకర్స్ కాలనీ వారి సౌజన్యంతో నూతన చలివేంద్రం శుక్రవారం ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సేవా స్ఫూర్తితో జిల్లాలో 100 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
అన్నమయ్య: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఈ విషయం తెలిసి జరుగుతుందో లేదో తెలియదని, కానీ త్రిసభ్య కమిటీ నివేదిక రాకముందే ఎమ్మెల్యే శ్రీధర్ను పార్టీ కార్యక్రమాల్లో అనుమతిస్తున్నారని బాధితురాలు హర్షవీణ ఆరోపించారు. ఇది పవన్ కళ్యాణ్కు తెలియకుండా జరుగుతుందా అనే సందేహాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విజయనగరం స్థానిక గూడ్స్ షెడ్ వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో శ్రీ సీతారామ కల్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా ఈవో వెంకటరమణ. ఛైర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి స్వామి వారికి దేవస్థానం తరుఫున పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణ మహోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు.
PLD: చిలకలూరిపేట మండలం కావూరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నరసరావుపేట వైపు వెళుతున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ చోదకుడు ఢీకొట్టిన వేగానికి గాల్లోకి ఎగిరి అదే ఆటోలో పడినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన అతడిని 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
W.G: భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని శ్రీ పద్మావతీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అపురూప దృశ్యం అవిష్కృతమైంది. ఉత్తరాయణ పుణ్యకాలం, మీన సంక్రమణం వేళ శుక్రవారం ఉదయం సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. శ్రీరామననమి పర్వదినం నాడే ఈ విశేషం జరగడంతో భక్తులు పులకించిపోయారు. ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
CTR: జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ను జనసైనికులు కలసి ఘనంగా సత్కరించారు. పార్టీకి విశేష సేవలందించిన ఆయనకు గజమాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ, ప్రజలకు మేలు చేసే దిశగా కృషి చేయాలని హరిప్రసాద్ పిలుపునిచ్చారు.
ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో జననీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
KRNL: సీతారాముల కళ్యాణ మహోత్సవం స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి కర్నూలు జిల్లాలో ఘనంగా జరిగాయి. సీతారాముల కళ్యాణ భక్తాదులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములో పాల్గొని మంగళ హారతి, తీర్ధప్రసాదములు స్వీకరించి, స్వామి వార్ల కృపకు పాత్రులయారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
TPT: రేణిగుంట మండలం గుత్తివారి పల్లి గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ, రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొని సీతారాములును దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో శుక్రవారం చేస్తున్న పెండింగ్లో ఉన్న ఇంటి ప్రాపర్టీ టాక్స్ వసూలు ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు.ఇంటింటికి తిరుగుతూ పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ టాక్స్ వెంటనే చెల్లించాలని ప్రజలకు సూచించారు. ఆమె మాట్లాడుతూ.. సకాలంలో ప్రాపర్టీ టాక్స్ చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
KDP: గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్లోకి శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నీరు విడుదల చేసినట్లు ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గండికోట జలాశయం నుంచి ఒక గేటు ఎత్తి 2500 క్యూసెక్కుల నీరు మైలవరం రిజర్వాయర్కు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 24.60 టీఎంసీల నీరు నిలువ ఉన్నట్లు ఈఈ వివరించారు.
ASR: మెగా డీఎస్సీ ద్వారా నియమితులైన కొందరు ఉపాధ్యాయులకు వార్డెన్ బాధ్యతలు అప్పగించే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము అంగీకరించలేమని పలువురు టీచర్లు తెలిపారు. శుక్రవారం టీడీపీ పాడేరు ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిర్వహించిన ప్రజా దర్బార్లో వినతి పత్రం సమర్పించారు. తాము టీచర్ పోస్టులకే ఎంపికయ్యామని, వార్డెన్గా బాధ్యతలు తీసుకోలేమని పేర్కొన్నారు.
NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా యనకండ్లలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. మంత్రి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ.. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పార్వతీపురం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ రామ నవమి వేడుకల్లో జిల్లా రెండోవ అదనపు న్యాయమూర్తి ఎస్. దామోదరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ముందుగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అర్చకులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.