BPT: అద్దంకి మండలంలో పంటలు సాగు చేసిన రైతులు బుధవారం సాయంత్రం లోగా ఖచ్చితంగా ‘ఈ-క్రాప్’ నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి (AO) వెంకటకృష్ణ సూచించారు. ప్రభుత్వ పథకాలు, పెట్టుబడి సాయం, ఇన్ పుట్ సబ్సిడీ పొందాలంటే ఈ నమోదు తప్పనిసరి. ఇంకా నమోదు చేసుకోని వారు వెంటనే తమ గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.
GNTR: తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్దిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును మంగళవారం ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా ఖండించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నా తమకు అన్యాయమే జరిగిందని వారు వాపోయారు. ఈ నెల 27న ఆయేషా అవశేషాలను తిరిగి ఖననం చేస్తామని, ఆ క్షణమే సత్యానికి అంతిమ సంస్కారం జరుగుతుందని వారు ప్రకటించారు.
GNTR: నల్లచెరువు ప్రాంతంలో ఇటీవల వీధికుక్కల దాడిలో గాయపడి జీజీహెచ్ (GGH)లో చికిత్స పొందుతున్న చిన్నారులు ఫణీంద్ర, ఆయాన్లను వైసీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా మంగళవారం రాత్రి పరామర్శించారు.ఆసుపత్రిలో చిన్నారులు అందుతున్న వైద్య సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన ఆమె, మెరుగైన చికిత్స అందేలా చూడాలని కోరారు.
GNTR: తెనాలి హెడ్ వాటర్ వర్క్స్ మోటార్ రిపేర్ కారణంగా బుధవారం పట్టణంలోని 40 వార్డులకు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. ప్రజలు దీనిని గమనించి ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. గురువారం నుంచి యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని, కావున ప్రజలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
SKLM: రైతు గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ వర్మ అన్నారు. నందిగాం మండల పరిధిలోని చిన్నలవుని పల్లి, నౌగాం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రాయితీలు పొందేందుకు గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు.
BPT: అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఆసరాగా నిలుస్తోందని ఎమ్మెల్యే సాంబశివరావు క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం ఇసుకదర్శిలోని కార్యాలయంలో, ఇంకొల్లు గ్రామానికి చెందిన షేక్ చాందిని వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.3,02,598 విలువైన ఎల్ఓసీ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
GNTR: జీజీహెచ్లో కుక్కకాటుకు గురై చికిత్స పొందుతున్న చిన్నారులను వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మంగళవారం పరామర్శించారు. నల్లచెరువు వద్ద కుక్కల దాడిలో గాయపడిన ఫణీంద్ర రెడ్డి, షేక్ ఆయన్ల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులకు ఆమె ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
PLD: మాచర్ల విద్యుత్ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ హఠాన్మరణం చెందిన హుస్సేన్ కుటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. అందరూ కలిసి సేకరించిన రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని మంగళవారం పల్నాడు జిల్లా ఎస్ఈ డాక్టర్ విజయకుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తా మన్నారు.
ప్రకాశం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రకాశం జిల్లా దర్శిలో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
CTR: విజయవాడలోని జరిగిన ఏపీ శాసనసభక్రీడా పోటీల్లో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు. మంగళవారం జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో ఆయన ప్రతిభకనబరిచి రెండో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
AKP: రాంబిల్లి(మం) మూలజంప జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు విద్యార్థులను చదివిస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తున్నట్లు హెచ్ఎం బాల ప్రభావతి, హిందీ టీచర్ రమణారావు తెలిపారు. శత శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
TPT: వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అసెంబ్లీ సమావేశం తర్వాత DY.CM పవన్ కళ్యాణ్ను కలిసి వినతపత్రం అందించారు. వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరారు. వెంకటగిరికి ఎంతో చరిత్ర ఉందని చెప్పారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాలను చూపాలని ఆయనకు విన్నవించారు.
ప్రకాశం: గిద్దలూరు సీడీపీవో కార్యాలయం ముందు మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. లేబర్ కోడ్స్ రద్దు చేసి, పాత చట్టాలనే అమలు చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంగన్వాడీలకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు.
GNTR: గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా జనగణన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. జనగణన ప్రక్రియలో చార్జ్ ఆఫీసర్లు, అడిషనల్ చార్జ్ ఆఫీసర్లు, ఎన్యుమరేటర్ల బాధ్యతలు అత్యంత కీలకమని తెలిపారు. డిజిటల్ యాప్ల ద్వారా నిర్వహించనున్న జనగణనలో నాణ్యమైన డేటా సేకరణకు పూర్తి అవగాహనతో పాటు సమర్థ పర్యవేక్షణ అవసరమని సూచించారు.
ASR: నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్కు పాడేరు మండలం, గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాల 9వ తరగతి విద్యార్ధినిలు ఎంపికయ్యారు. అమృతసర్లో జరుగుతున్న ఈ టోర్నమెంట్కు విద్యార్ధినిలు హాజరవుతున్నారు. ఈ మేరకు జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మంగళవారం విశాఖ ఎయిర్ పోర్ట్లో విద్యార్ధినిలకు శుభాకాంక్షలు తెలిపారు.