KDP: గ్రామాభివృద్ధిలో భాగంగా స్మశాన వాటికల ఏర్పాటు ఎంతో అవసరమని మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం మైదుకూరు మండలం వనిపెంట గ్రామపంచాయతీలో స్మశాన వాటిక ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్ నాయుడు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.