కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీఎస్పీ బాబు ప్రసాద్ ఇవాళ ప్రారంభించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు, ప్రజలకు చల్లని త్రాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజల సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.