అమరావతి మండలం వైకుంటపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనైతిక కార్యకలాపాలతో తిరుమల పవిత్రతను దిగజారుస్తున్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.