NDL: కొలిమిగుండ్ల మండలం నందిపాడు సమీపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల పొట్టు లోడుతో వెళ్తున్న లారీలో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం మంటలు వ్యాపించగా పోలీసులు, రాంకో ఫైర్ సిబ్బంది సహాయంతో స్థానికులు మంటలను ఆర్పివేశారు. తిరిగి రాత్రి 8 గంటల సమయంలో అక్కడే ఉన్న పొట్టు లారీలో మళ్లీ మంటలు వ్యాపించాయి. దీంతో లారీ పూర్తిగా దగ్ధమైంది.
NLR: జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల కేంద్రాలను మంగళవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా తనిఖీ చేశారు. నగరంలోని డీకే డబ్ల్యూ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారో పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలను నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు ఆయన సూచించారు.
సత్యసాయి: గొల్లపల్లి రిజర్వాయర్ను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జిల్లా పర్యాటక అధికారి నరసయ్య బృందం క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేపట్టింది. రిజర్వాయర్లో పర్యాటకులను ఆకర్షించేందుకు బోటింగ్ కేంద్రం ఏర్పాటుపై అధికారులు చర్చించారు. పర్యాటకుల బస కోసం అత్యాధునిక రిసార్టులు, గదుల నిర్మాణానికి అనువైన స్థలాలను ఈ సందర్భంగా గుర్తించారు.
KRNL: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ.కబర్ధి నేతృత్వంలో మంగళవారం స్థానిక జిల్లా కారాగారాన్ని సందర్శించింది. ఈ బృందం జైలులోని వసతులు, ఖైదీల యోగక్షేమాలను స్వయంగా పరిశీలించింది. జైలు కిచెన్ను సందర్శించిన అధికారులు, ఖైదీలకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేసింది.
AKP: కోటవురట్ల మండలం తంగేడు గ్రామంలో విత్తన ప్రాసెసింగ్ యూనిట్ ను జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యమైన విత్తనాలు తయారు చేయాలని సూచించారు. తయారుచేసిన విత్తనాలను మెంటలేషన్ చక్కగా ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలన్నారు. మండల వ్యవసాయ అధికారిణి సరోజిని పాల్గొన్నారు.
TPT: పదవ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 01 వరకు నిర్వహించబడతాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 31,334 మంది విద్యార్థులు 179 కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతారు. ప్రశ్నపత్రాల రవాణాకు కట్టుదిట్టమైన భద్రత, కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, సెక్షన్ 144 అమలు చేయాలని సూచించారు.
కోనసీమ: టీడీపీ అంటే ఒక పార్టీ మాత్రమే కాదని, ఇదొక సమిష్టి కుటుంబమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం మానవవనరుల శాఖామంత్రి, యువ నాయకులు నారా లోకేష్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన డిన్నర్ ఆత్మీయ సమావేశం ఈ అంశాన్ని మరోసారి రుజువు చేసిందని ఆయన పేర్కొన్నారు.
GNTR: మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సుందరంగా అలంకరించిన ఉత్సవ మూర్తులతో మాడవీధుల నుంచి మిద్దె సెంటర్ వరకు గ్రామోత్సవం వైభవంగా సాగింది. ఈ వాహన సేవను దర్శించుకుంటే భక్తులకు సద్బుద్ధి, అభయం కలుగుతాయని ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.
CTR: పలమనేరు పెద్ద చెరువు కట్టపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు బైకులు ఢీ కొట్టిన ఘటనలో మండిపేట కోటూరుకు చెందిన లక్ష్మీ పతి, మాదిగ బండకు చెందిన హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
సత్యసాయి: నల్లమాడ మండల పరిధిలోని రెడ్డిపల్లి ప్రాంతంలో జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 4,800 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. రహస్య సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి జూద స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ATP: జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజాప్రతినిధులు అధికారులతో చర్చించారు. నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, పనుల్లో నాణ్యత పాటించాలని మంత్రులు ఆదేశించారు.
నెల్లూరు జిల్లా టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వెంకటాచలం పంచాయతీ వడ్డె పాలెం వైసీపీ నేత ఉప్పు రాఘవేంద్రను నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాఘవేంద్రపై దాడి హేయమన్నారు. వెంకటాచలం పంచాయతీలో దాడులు, దౌర్జన్యాలు ఎక్కువైపోయాయన్నారు.
KKD: గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పిఠాపురం సీఐ శ్రీనివాస్ వాహనాలను అర్ధరాత్రి తనిఖీ చేశారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేపట్టారు. అలాగే “వాష్ & గో” కార్యక్రమం ద్వారా వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ, పీయూసీ తదితర పత్రాలను సమగ్రంగా పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచనలు ఇచ్చారు.
E.G: లోక్ అదాలత్లో పెండింగ్ కేసులను రాజీ చేసుకోవాలని తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి ఎం.అనురాధ సూచించారు. మంగళవారం కొవ్వూరు కోర్ట్ హాల్ నుంచి పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమని, దీనివల్ల సమయం, ధనం ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు జివిఎల్ సరస్వతి, జి. సాయికృష్ణ, CIలు, SIలు పాల్గొన్నారు.
PLD: పెదకూరపాడు మండలం పొడపాడులో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించారు. ‘100 రోజులు – 100 గ్రామాలు’ లక్ష్యంతో ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అన్ని శాఖల అధికారులతో కలిసి గ్రామంలోనే సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.