KKD: కిర్లంపూడి మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బాయిశెట్టి హరికృష్ణ తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షుడు తోట రవి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మండల అభివృద్ధి, బడ్జెట్ కేటాయింపులపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు.