W.G: నవ్యాంధ్రకి అమరావతి రాజధానిగా ప్రభుత్వం ప్రకటించడంతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇవాళ ఉదయం తెలుగు రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన రైతులు, టీడీపీ పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.