GNTR: తాడేపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా శనివారం సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో సీతారాముల తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. దుర్గగుడి అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి, ఈ తెప్పోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.