HYD నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. సౌత్ సెంట్రల్ రైల్వే రూ.430 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశలో రాయగిరి వరకు 33 కిమీ లైన్ నిర్మాణం జరగనుంది.