E.G: కానవరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పరిజల్లిపేట, ఇండస్ట్రియల్ ఫీడర్లకు వార్షిక మరమ్మతులు చేపట్టనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జై నటరాజన్ తెలిపారు. దీంతో శనివారం మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. కానవరం, చక్రద్వారాబంధం ప్రాంతాల వినియోగదారులు ఈ అంతరాయాన్ని గమనించి, సిబ్బందికి సహకరించాలన్నారు.