మన్యం: పెదగుడబ ప్రధాన రహదారి ఇటీవల అకాల వర్షాల కారణంగా దారుణంగా మారింది. పార్వతీపురం గరుగుబిల్లి మార్గంలోని ఈ రోడ్డుపై గోతులు ఏర్పడి, క్వారీ లారీల రాకపోకలతో మట్టి బురదగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వెంటనే మరమత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.