NDL: అవుకు కొండల్లోని కంబగిరి స్వామి ఆలయంలో ఈనెల 29 నుంచి ఏప్రిల్ 3 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆలయ ఈవో రామకృష్ణ శుక్రవారం ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను అందజేసి ఉత్సవాల వివరాలు వివరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.