KMM: రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయలు పండించే రైతులకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ ‘కిసాన్ ఐడీ కార్డులు’ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్డుల ద్వారా రైతులకు సాగు రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు సులభతరం చేయడంతో పాటు పలు ప్రోత్సాహకాలు అందించనున్నారు.