సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ హరీష్ బాబు పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీలను సందర్శించారు. పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ కొరత రాకుండా చూడాలని యజమానులకు సూచించారు. అవసరమైతే మంత్రి స్వయంగా అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు.