NDL: కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయి పల్లె గ్రామంలో ఇవాళ ఆదిలక్ష్మి అనే మహిళపై అదే గ్రామానికి చెందిన వీరాంజి నాయక్ అనే వ్యక్తి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరాంజి నాయక్ ఆదిలక్ష్మి ఇంటి వద్ద ఉన్న దిమ్మెలను పడగొట్టాడని ఆమె ఆరోపించారు. అనంతరం ఆదిలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.