భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో బంగ్లా క్రికెటర్లను IPLలో ఆడేందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆ దేశంలో IPL మ్యాచుల బ్రాడ్కాస్టింగ్ను బహిష్కరించాలని డిమాండ్లు వచ్చాయి. అయితే, తమ దేశంలో IPL ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతిస్తున్నట్లు బంగ్లా ప్రసారశాఖ మంత్రి వెల్లడించారు.