KDP: జిల్లాలోని ప్రొద్దుటూరు, వేంపల్లి, పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల వేతనాలు తగ్గించి చెల్లిస్తున్నారని ఆరోపిస్తూ ఏఐటీయూసీ నాయకులు పాత రిమ్స్లో జిల్లా కార్మిక శాఖ అధికారి ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. డిసెంబర్ 2025 వరకు రూ.12,400 చెల్లించగా, జనవరి 2026 నుంచి రూ.11,700–11,800 మాత్రమే జమ చేస్తున్నారని తెలిపారు.