JN: బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు అన్నారు. రఘునాథపల్లిలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ సన్నాహక సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచి బీజేపీ విధానాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలన్నారు.