WGL: నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెంలో రంగయ్య చెరువు కాలువ పనులను పూర్తి చేసి రైతుల పంటకు నీరు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కాలువలను మాజీ ఎమ్మెల్యే ఇవాళ పరిశీలించారు. తక్షణమే పనులను పూర్తి చేసి రైతులకు నీరు ఇవ్వాలని, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలన్నారు.