HNK: ఏప్రిల్ ఒకటి నుంచి నిర్వహించే ఇంటింటా సీపీఐ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి పిలుపునిచ్చారు. గుండ్లసింగారం గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి పోరాటాలు చేసేందుకు నిర్వహించబోయే కార్యక్రమానికి ప్రజల మద్దతు ఉండాలన్నారు.