VZM: గజపతినగరం నియోజకవర్గంలో బుధవారం కార్మికులు నిరసన చేపట్టారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ అంగన్వాడీలు, పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు నల్ల రిబ్బన్లతో విధులు నిర్వహించారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మారుస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి విమర్శించారు.