W.G: కాళ్లకూరులో కొలువైన స్వయంభూ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నదాన భవనానికి రూ.1,00,116 విరాళం అందినట్లు ఈవో మోకా అరుణ్ కుమార్, ఛైర్మన్ అడ్డాల శివరామరాజు తెలిపారు. కాళ్లకు చెందిన పుప్పాల వెంకటసూర్య నరసింహారావు, శ్రీదేవి దంపతులు ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు చేతుల మీదుగా ఈ మొత్తాన్ని అందజేశారు. దాతల సహకారం అభినందనీయమని ఆలయ కమిటీ పేర్కొంది.