చలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లు 98.45 శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇంకా రూ. 5,501 కోట్ల విలువ పెద్ద నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. రూ.2,000 నోట్ల ఉపసంహరణ చేసిన నాటికి వ్యవస్థలో మొత్తం రూ.3.56లక్షల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. ఇప్పటికీ ఎవరి వద్దనైనా పెద్ద నోట్లు ఉంటే ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.