విశాఖలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ సహా పలువురు వైసీపీ కీలక నేతలు ద్రోణంరాజు శ్రీవత్సవ నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్పాహార కార్యక్రమంలో పాల్గొని పాత అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం శ్రీవత్సవ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, 2029లో జగన్ను మళ్లీ సీఎంగా తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.