GNTR: గుంటూరు పట్టణంలోని బ్రాడీపేట శారదా నికేతన్ కళాశాలలో గుళ్లపల్లి సుబ్బారావు సంస్థ రూ.25 లక్షలతో తరగతి గది, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసింది. వీటిని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ప్రారంభించారు. సుదీర్ఘకాలంగా సంస్థ చేస్తున్న సేవలను ఆమె కొనియాడారు. సీఎం పీ4 విధానంతో విద్యావ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు.