PPM: జిల్లాలో భారత్ గ్యాస్ వినియోగదారుల బాధలు చూడాలని కాంగ్రెస్ పార్టీ DCC జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు కోరారు. ఆయన బుధవారం డిప్యూటీ కలెక్టర్ దిలీప్ చక్రవర్తిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో భారత్ గ్యాస్ సక్రమంగా సరఫరా జరగటం లేదని వినియోగదారులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. నెలరోజులుగా వినియోగదారులకు భారత్ గ్యాస్ పంపిణీ జరగలేదన్నారు.