KDP: ప్రొద్దుటూరులోని 27వ వార్డులో బుధవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 14,313 మంది లబ్ధిదారులకు రూ. 6,20,64,500లు NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, టీడీపీ నేతలు పాల్గొన్నారు.