PPM: ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి యువతకు పిలుపు ఇచ్చారు. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగ్లకు పాల్పడేవారు ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొంతమంది సులభంగా అధిక నగదు సంపాదించవచ్చని ప్రలోభాలు పెడతారని వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.