SS: గుడిబండ మండలం మోరుబాగలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రామలింగప్ప అనారోగ్యంతో కన్నుమూశారు. చిన్నప్పటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన ఆయన మృతి పట్ల మడకశిర తెలుగుదేశం పార్టీ కుటుంబం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. నిబద్ధత గల నాయకుడిని కోల్పోవడం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.