KRNL: కోసిగి మండలం కందుకూరు సమీప తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు కర్ణాటక వాసులు మృతి చెందడంపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి మృతదేహాలను స్వస్థలాలకు తరలించాలన్నారు. పెళ్లికి వచ్చి ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని శుక్రవారం ఎంపీ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.