కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈ నెల 29న కలకత్తాలో ఉగాది విశిష్ట పురస్కారం అందుకోనున్నారు. కలకత్తా ఆంధ్ర సంఘం వారి 90 వసంతాల తెలుగు వెలుగులు పురస్కరించుకొని ఆయనకు ఈ పురస్కారం అందించనున్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తులలో ఒకరిగా, సాంస్కృతిక విద్యా రంగాల్లో చేస్తున్న కృషి, తెలుగు భాషా వికాసానికి అందిస్తున్న తోడ్పాటుకు గుర్తింపు లభించింది.