కోనసీమ: కపీలేశ్వరపురం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాతపూడి గ్రామ అధ్యక్షులు భూల వీరబాబు ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగుదేశంకు చెందిన 25 మంది బీసీ కార్యకర్తలు మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ పార్టీ కండువాలు వేసి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.