KKD: 2 నెలలుగా కాకినాడ, పోలవరం జిల్లాలను గడగడలాడిస్తున్న పెద్దపులి పోలవరం జిల్లా ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 27 పశువుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. దేవీపట్నం, రంప, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో పులి తన ప్రతాపం చూపుతోంది. తాజాగా దేవీపట్నం మండలంలో ఒకేసారి 4 పశువులపై దాడి చేయడంతో ఈ ప్రాంత వాసులు వణుకుతున్నారు.