AP: చిత్తూరు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మం. శేషాపురం వద్ద నేషనల్ హైవేపై ఆగి ఉన్న RTC బస్సును కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వేగంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.