SDPT: సిద్దిపేటలోని ఓ స్కూల్లో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత వివరించారు. సిగ్నల్స్, రోడ్డు గుర్తులు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.