శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తిరుమలలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. సా.6-రా.9 గంటల మధ్య వేడుకగా సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా రేపు రా.7-8:30 గంటల మధ్య శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది.