ASR: సీలేరు మండలం ధారకొండలో శనివారం ఉదయం 9 గంటల నుండి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్థానిక పీఎస్సీ వైద్యులు బాబ్జి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చింతపల్లి సామాజిక ఆసుపత్రి నుంచి వైద్య బృందం వస్తుంది. శస్త్రచికిత్సలు అవసరమైనవారిని ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సులు తీసుకురావాలి.