కడప: న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కోసం ఈ నెల 30వ తేదీ పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారిగా నియమితులైన సీనియర్ న్యాయవాది బాలాజీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ట్రెజరర్ పదవులకు 24వ తేదీ మంగళవారం, 25న బుధవారం నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.