W.G: సీపీఎం చేపట్టిన ‘ప్రజా చైతన్య పాదయాత్ర’ను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు శనివారం రాత్రి అభినందించారు. భీమవరంలో సాగుతున్న యాత్రను చూసి తన వాహనాన్ని ఆపి, బృందంతో మాట్లాడారు. ఈ సందర్భంగా JNV గోపాలన్ ప్రజా సమస్యలపై రూపొందించిన వినతిపత్రాన్ని ఛైర్మన్కు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న ఈ కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు