E.G: రోడ్ల నిర్మాణం, నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలపై ఎలాంటి రాజీ ఉండకూడదని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. ఆదర్శ్ నగర్, మహాలక్ష్మి టెంపుల్ పార్క్ వద్ద ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పనులను ఇవాళ పరిశీలించారు. పూర్తి చేసిన రహదారుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. క్వాలిటీ కంట్రోల్ అధికారులు పనులను కచ్చితంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.