BPT: నరసరావుపేటలో నేస్తం ట్రస్టు, ఏపీ కార్టూనిస్టుల సంఘం ఆధ్వర్యంలో నేడు రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శన జరగనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పోలా త్రివిక్రమరావు, కార్టూనిస్ట్ సంఘం అధ్యక్షుడు అన్నం శ్రీధర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కార్టూన్లు-ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అనే అంశంపై చర్చావేదిక ఉంటుందన్నారు.