ATP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ కోసం ఎగ్జామినర్లను తొలిసారిగా ఆన్లైన్ ద్వారా నియమించనున్నట్లు డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. పరీక్షల నిర్వహణ మాదిరిగానే మూల్యాంకన విధులకు సంబంధించిన నియామక ఉత్తర్వులను ఉపాధ్యాయుల వ్యక్తిగత లాగిన్ల ద్వారా నేరుగా పంపనున్నారు.