• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఈనెల 30న సాధారణ సర్వసభ్య సమావేశం

KDP: కమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు మండల ప్రజాపరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తామని ఎంపీడీవో కిజియా తెలిపారు. మండలంలోని సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యుడు, కోఆప్సన్ సభ్యులు, అన్ని శాఖల అధికారులు హజరు కావాలన్నారు. అన్ని అంశాలపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

March 28, 2026 / 06:40 AM IST

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పసల చెంగయ్య

TPT: నాయుడుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి శుక్రవారం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో అధ్యక్షుడిగా పసల చెంగయ్య  ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా తలారి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా గోళ్ళ వీరాస్వామి ఎన్నికయ్యారు. ఇతర పదవులకు కూడా సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన వారికి పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

March 28, 2026 / 06:38 AM IST

జిల్లాకు మూడు అదనపు కోర్టులు

అనకాపల్లి: జిల్లాకు మూడు అదనపు కోర్టులు మంజూరయ్యాయి. వీటిలో ఎలమంచిలిలో అదనపు సివిల్ జడ్జి కోర్టు, నర్సీపట్నంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, అదనపు సివిల్ జడ్జి కోర్టులు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ఈనెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హైకోర్టు ప్రతిపాదన మేరకు క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

March 28, 2026 / 06:32 AM IST

డిప్యూటీ స్పీకర్ పై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్

W.G: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆకివీడు రామాలయంలో పూజకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖండించారు. పవిత్రమైన పండుగ రోజున ఇలాంటి ఘటన జరగడం వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘర్షణలో గాయపడిన జనసేన పార్టీ నాయకులు వీలైనంత త్వరగా కోలుకోవాలని పవన్ ఆకాంక్షించారు.

March 28, 2026 / 06:30 AM IST

జిల్లాలో నేరరహిత సమాజమే లక్ష్యం

అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు ప్రజల భద్రతను లక్ష్యంగా చేసుకుని పోలీసు యంత్రాంగం శుక్రవారం పట్టణాలు, గ్రామాల్లో విస్తృతంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించింది. గ్రామసభల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి, మహిళల భద్రత, బాల్యవివాహాల నివారణ, చైన్‌స్నాచింగ్‌పై అప్రమత్తత గురించి సూచనలు ఇచ్చారు .గంజాయి, డ్రగ్స్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు.

March 28, 2026 / 06:30 AM IST

చింతలపూడి సర్కిల్లో 32 మంది అరెస్ట్

ELR: చింతలపూడి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పేకాట, కోడి పందాల స్థావరాలపై సీఐ క్రాంతి కుమార్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. 32 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 30,180 నగదు, 20 మోటార్ సైకిల్, 14 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

March 28, 2026 / 06:30 AM IST

పోలీస్ యంత్రాంగానికి హోం మంత్రి అభినందన

ATP: SP జగదీశ్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన ‘స్త్రీ రక్ష’ వెబ్ పోర్టల్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత అభినందించారు. మహిళల రక్షణను బలోపేతం చేస్తూ, ఫిర్యాదుల త్వరిత పరిష్కారానికి ఈ పోర్టల్ దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. సాంకేతికతను సామాన్యులకు చేరువ చేస్తూ ఎస్పీ జగదీష్ నేతృత్వంలోని బృందం సాగిస్తున్న కృషిని కొనియాడారు.

March 28, 2026 / 06:30 AM IST

రాజాంలో నాకాబంధీ.. తొమ్మిది మందిపై కేసులు

VZM: రాజాం CI అశోక్ కుమార్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం నాకాబందీ నిర్వహించారు. ఈ మేరకు కొండంపేట రోడ్డు జంక్షన్‌, డోలపేట, గాయత్రి కాలనీలలో SIలు ఉమా వెంకటేశ్వరరావు, చంద్ర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి ఆటోలు నడిపిన ఇద్దరిపై డ్రంక్‌ & డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాలో మద్యం సేవించిన ఏడుగురిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశామన్నారు.

March 28, 2026 / 06:27 AM IST

29 నుంచి వేమన తిరునాల ప్రారంభం

SS: గాండ్లపెంట మండలం కటారుపల్లి యోగి వేమన ఆలయంలో ఈనెల 29 నుంచి వార్షిక తిరునాల ప్రారంభం కానుంది. వారం రోజులు నిర్వహించే ఈ ఉత్సవాల కోసం పీఠాధిపతి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాత్రి కుంభాభిషేకం, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఉంటాయి. 30న పానక పందేరం, బండ్ల మెరవణి, 31న అగ్ని సేవ, ఏప్రిల్ 1న గొడుగుల మెరవణి నిర్వహిస్తారు.

March 28, 2026 / 06:24 AM IST

పాలీసెట్‌కు ఉచిత శిక్షణ

NLR: వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ పాలి టెక్నిక్ కళాశాలలో పాలిసెట్ 2026కు ఉచిత శిక్షణ ఇస్తారు. ఏప్రిల్ 1 నుంచి 22వ తేదీ వరకు శిక్షణ ఉంటుంది. పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ఎస్. రామారావు కోరారు. శిక్షణ తరగతులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు.

March 28, 2026 / 06:24 AM IST

కాకినాడ TO వైజాగ్‌కు సముద్ర ప్రయాణం

కాకినాడ నుంచి విశాఖపట్నంకు సముద్ర మార్గంలో ప్రయాణించేలా టూరిజం శాఖ సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూరల్ బీచ్ నుంచి ‘సీ గైడర్స్’ వాహనాలను ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే కేవలం గంటలోపే విశాఖకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైలు, బస్సు సర్వీసులకు ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారుతుంది.

March 28, 2026 / 06:22 AM IST

ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీ

NDL: శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్యాపిలి మండలం ఎస్. రంగాపురంలో ఎద్దుల బండలాగుడు పోటీలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలలో వివిధ ప్రాంతాల నుంచి రైతులు పాల్గొని తమ ఎద్దుల బల ప్రదర్శన చేశారు. విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేయబడ్డాయి. గ్రామాల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు, సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడానికి దోహదపడతాయని నాయకులు తెలిపారు.

March 28, 2026 / 06:21 AM IST

పులికాట్ సరస్సులో నీటి కొరత.. పక్షుల ఇబ్బందులు

TPT: సూళ్లూరుపేట మండలం పులికాట్ సరస్సు ఎండిపోతుండటంతో వలస పక్షులు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నాయి. పెలికాన్ పక్షి మృతి కలకలం రేపగా, మరిన్ని పక్షుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ ద్వారంలో పూడిక తొలగించకపోవడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

March 28, 2026 / 06:20 AM IST

మాజీ సీఎంపై సోమిశెట్టి తీవ్రస్థాయిలో విమర్శలు

కర్నూలు కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర, దేశ పరిణామాలపై అవగాహన లేకుండా వైసీపీ వర్గాల సమాచారం ఆధారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

March 28, 2026 / 06:18 AM IST

రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: కవిటి ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఆ శాఖ పలాస ఈఈ యజ్ఞేశ్వర రావు తెలిపారు. గొండ్యాలపుట్టుగ, ప్రగడపుట్టుగ, పుక్కళ్లపాలెం, జాలారిపాలెం, కొత్తపాలెం, కవిటి కొత్తూరు, కవిటి టౌన్‌కు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు.

March 28, 2026 / 06:14 AM IST