AKP: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవల్సిన బాధ్యత అందరిపైన ఉందని జాయింట్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ సూచించారు. శనివారం సబ్బవరం కేజీబీవీలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయవద్దన్నారు.