PPM: గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలో శనివారం సుమారు 14 అడుగుల కింగ్ కోబ్రా ప్రత్యక్షమై భయాందోళన సృష్టించింది. భారీ విషసర్పాన్ని చూసిన స్థానికులు భయంతో దానిని హతమార్చారు. ఇటీవల అటవీప్రాంతాల్లో కింగ్ కోబ్రాలు తరచూ కనిపిస్తున్నాయని, పోడు వ్యవసాయానికి వెళ్లడానికే భయంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.